తెలంగాణాలో
సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )(Part – 1 )
ప్రాతూరి
పోతయ్య శర్మ
8143189271
1)హైదరాబాద్ సంస్థానం లో ఉన్న మూడు భౌగోళిక
ప్రాంతలేవి ?
a) తెలంగాణా b)మరాఠ్వాడ c) కర్ణాటక
జవాబు : పై మూడు
2) గతం లో ఎవరి అధీనం స్వాధీనం లో వేల ఎకరాల భూము
లుండేవి ?
జవాబులు : జగిర్దారులు ,జమిందారులు, సంస్థానాధి
పతులు , దేశ్ ముఖ్ లు, దేశ్ పాండే లు
3) 19 వ శతాబ్దం రెండవ భాగం లో హైదరాబాద్ వచ్చిన
సాహితీ వేత్తలు ఎవరు ?
జవాబు : మీర్జా ఖాన్ ధాఘ్ , హఫీజ్ జలీల్ హసన్
జలీల్ , మౌన్షి అమీర్ , అహ్మద్ మి నై
4) ఏ ప్రముఖ ఉర్దూ కవి హైదరాబాద్ కు వలస వచ్చారు ?
జవాబు : అమీర్ రాంపూర్
5) ఉర్దూ భోధన భాషగా ప్రారంభమైన విశ్వ విద్యాలయం ఏది
?
జవాబు : ఉస్మానియా విశ్వవిద్యాలయం
6) ఉర్దూ భాషాభి వృద్ది కోసం మౌల్వి అబ్దుల్ హక్
దేన్నీ ప్రారం భించారు ?
జవాబు : అంజుమన్ తారక్ – ఇ – ఉర్దూ
7) తెలంగాణా లో ఒద్దిరాజు సోదరులు గా పేరొందిన సీతారాం
చందర్ రావు , రాఘవ రంగా రావు లు 1920 లో దేన్నీ ప్రారంభిం చారు ? ఇది వరంగల్
జిల్లా లోని ఇనుగుర్తి గ్రామం నుండి వెలువడేది .
జవాబు: ‘తెలుగు ‘ వార పత్రిక
8) నల్గొండ నుండి ‘నీల గిరి ‘ వార పత్రిక ఎవరి
సంపాదకత్వం లో వెలువడేది ?
జవాబు : షబ్నవీసు రామ నర్సింహా రావు
9) ఎవరి సంపాదకత్వం లో డెక్కన్ క్రానికల్ అనే
ఇంగ్లీష్ పత్రిక వెలువడింది ?
జవాబు : బుక్క పట్నం రామాచార్యులు
10) సురవరం ప్రతాప రెడ్డి రాసిన ముఖ్య గ్రంధం ఏది ?
జవాబు : ఆంధ్రుల సాంఘిక చరిత్ర .
చంపకి భ్రమర విషాదం , ప్రేమార్పణం , హిందువుల
పండుగలు , హైందవ ధర్మ వీరులు , రామాయణ విశేషములు ఆయన రాసిన ఇతర గ్రంధాలు .
11
)1925 గోల్కొండ పక్ష పత్రిక స్థాపించి , సంపాద
కత్వం నిర్వహించింది ఎవరు ?
జవాబు : సురవరం ప్రతాప రెడ్డి
12) బూర్గుల రామకృష్ణ రావు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పండిత రాజ పంచామృతం , కృష్ణ శతకం
13)ఎవరిని అభినవ పోతన అంటారు ?
జవాబు : వానమామలై వరదాచార్యులు
14)వానమామలై వరదాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పోతన చరిత్ర , విప్ర లబ్ధ
15)మాడపాటి హన్మంత రావు రాసిన గ్రంధం ఏది ?
జవాబు : తెలంగాణా లో ఆంధ్రోద్యమం
16)1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా సాయుధ
పోరాటం లోని వివిధ ఘట్టాలను ఎవరు తన పుస్తకం ‘వీర తెలంగాణా ‘ గ్రంధం లో రాసారు ?
జవాబు : రావి నారాయణ రెడ్డి
17)1943 లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థా పించారు .
దీని మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జవాబు : లోకనంది శంకర నారాయణరావు
18)దాశరధి కృష్ణ మాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : అగ్ని ధార , రుద్ర వీణ
19)‘నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో
గేయాలు రాసిన దేవరు ?
జవాబు : దాశరధి కృష్ణమా చార్యులు
20)దాశరధి రంగా
చార్యులు రాసిన నవలలు / పుస్తకాలేవి ?
జవాబు : చిల్లర దేవుళ్ళు , జానపదం
21)‘ప్రజల మనిషి ‘ , ‘ గంగు ‘ , రామప్ప రభస అనే
సాంఘిక , ఆర్ధిక నేపధ్య నవలలు రాసిన దేవరు ?
జవాబు : వట్టికోట ఆళ్వారు స్వామి
22)హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం
అనే గ్రంధాలయం ఎప్పుడు స్థాపించారు ? ఇది తెలంగాణా లో తొలి తెలుగు గ్రంధాలయం .
జవాబు : 1901
23)ఎవరి కృషి వల్ల హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ
ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం 1901 స్థాపించారు?
జవాబు:కొమర్రాజు లక్ష్మణ రావు , రావి చెట్టు రంగా
రావు , మునగాల రాజా , నాయని వెంకట
రంగారావు
24)1905 లో దేన్నీ స్థాపించారు ?
జవాబు : శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష
నిలయం
25)సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం
ఎప్పు డు స్థాపించారు ?
జవాబు: 1905
26)1906 లో ఎవరు విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ని
స్థాపించారు ?
జవాబు : కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు (దీన్ని 1908 లో మద్రాస్ కు తరలించారు )
27)గ్రంధాలయో ద్యమానికి కృషి చేసిన దేవరు ?
జవాబు: కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు , వట్టికోట
ఆళ్వారు స్వామి
28)190 6 లో వివేక వర్ధని పాఠ శాల స్థాపించిన దేవరు ?
తర్వాత ఇది వివేక వర్ధని విద్య సంస్థ గా అభి వృద్ది చెందింది
జవాబు : కేశవ రావు కోరట్ కర్ , వామన్ రామచంద్ర
నాయక్ , గణపతి రావు హర్దికర్
No comments:
Post a Comment