Saturday, 13 June 2020

Indian History bits V


1. జతపరుచుము.
    
ప్రాంతీయ రాజ్యాలు            స్థాపకులు
    1)
హైదరాబాద్‌           ఎ) నిజామ్‌ ఉల్‌-ముల్క్‌(అసఫ్‌ జాహి)
    2)
బెంగాల్‌                బి) ముర్షిద్‌ ఖులీఖాన్‌
    3)
అవద్‌                  సి) సాదత్‌ ఖాన్‌
    1) 1-
, 2-బి, 3-సి   2) 1-బి, 2-సి, 3-
    3) 1-
సి, 2-బి, 3-   4) 1-సి, 3-, 3-బి
2. భారతదేశంలో మొదటి ఫ్రెంచి ప్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1)
సూరత్‌         2) పాండిచ్చేరి    3) చంద్రనాగూర్‌         4) మహె
3. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పడింది?
    1) 1915    2) 1920   3) 1926   4) 1930
4. సూరత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో(1907) అతివాదులు, మితవాదుల మధ్య ఏ అంశానికి సంబంఽధించి విభేదం వచ్చింది?
    1)
స్వరాజ్యం    2) విదేశీ వస్తుబహిష్కరణ, జాతీయ విద్య    3) శాసనసభల ఎన్నికలు     4) 1,2
5. బ్రిటీష్‌ సైన్యం ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించింది?
    1) 1803   2) 1806 3) 1807  4) 1810
6. జతపరుచుము...
    
వార్తాపత్రిక                 ప్రచురించిన ప్రాంతం
    1)
ఇండియన్‌ మిర్రర్‌        ఎ) బెంగాల్‌
    2)
ఆంధ్రప్రకాశిక             బి) మద్రాస్‌
    3)
కేసరి                      సి) బొంబాయి
    4)
ఆజాద్‌                    డి) ఉత్తరప్రదేశ్‌
    1) 1-
2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-డి, 3-సి, 4-
    3) 1-
సి, 2-, 3-డి, 4-బి   4) 1-డి, 2-సి, 3-బి, 4-
7. కాంగ్రెస్‌లో అతివాదులు, మితవాదులు తిరిగి ఎప్పుడు కలిశారు?
    1) 1917  2) 1916 3) 1925 4) 1980
8. ఈ కింది వానిలో ఏ చట్టంతో states స్వయం ప్రతిపత్తి ప్రారంభమైంది?
    1)
మింటో-మార్లే సంస్కరణలు      2) మాంటెగు-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు    3) భారత ప్రభుత్వ చట్టం, 1935      4) కేబినెట్‌ కమీషన్‌
9. మహారాష్ట్రలోని పరమహంస మండలి (1819) తో సంబంధం ఉన్నది ఏది?
    1)
కుల నియమాల ఉల్లంఘన      2) వితంతువు పునర్వివాహం      3) బహుభార్యత్వం      4) బహుభర్తృత్వం
10. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించాడు?
    1) 1930  2) 1931 3) 1926 4) 1934
11. కలకత్తాకు ముందు బెంగాల్‌లో ఉన్న ఈస్టిండియా కంపెనీ స్థావరం ఏది?
    1)
కాశింబజారు          2) చిట్టిగాంగ్‌    3) హుగ్లీ         4) ముర్షిదాబాదు
12. ఇంగ్లీషు వ్యాపారంపరంగా బెంగాల్‌ ప్రాముఖ్యానికి అనేక కారణాలున్నాయి. అయితే ఈ కింది వానిలో ఏది అటువంటి కారణం కాదు?
    1)
బాగా అభివృద్ధి చెందిన స్థానిక వ్యాపార సంస్థలు 2) జల మార్గాలు      3) సుసంపన్నమైన, విస్తుృతమైన హింటర్‌ లాండ్‌  4) ఐరోపాలో డిమాండ్‌ ఉన్న వస్తువుల లభ్యత
13. మీర్‌జాఫర్‌కు బెంగాల్‌ సింహాసనాన్ని అప్పగించడానికి అనేక కుట్రలు జరిగాయి. ఈ కుట్రదారుల్లో ఎవరిని అదుపులో పెట్టడానికి రాబర్ట్‌క్లైవ్‌ ఫోర్జరీ చేశాడు?
    1)
మీర్‌జాఫర్‌     2) రాయ్‌దుర్లభ్‌    3) అమినుచంద్‌      4) జగత్‌సేఠ్‌
14. కల్నల్‌  క్లైవ్‌స్‌ జాకాల్‌గా ఎవరిని అభివర్ణిస్తారు?
    1)
అమియచంద్‌         2) మానిక్‌చంద్‌    3) మీర్‌జాఫర్‌         4) జగత్‌సేఠ్‌
15. ప్లాసీ యుద్ధానికి ముందు బెంగాల్‌ నవాబుకు వ్యతిరేకంగా ఇంగ్లీష్‌ వారితో కలిసి కుట్ర పన్నిన వారు ఎవరు?
    1)
మీర్‌జాఫర్‌     2) మానిక్‌చంద్‌    3) జగత్‌సేఠ్‌     4) పైఅందరూ
16. 1760 బెంగాల్‌ తిరుగుబాటు ఈ కింది వానిలో దేనిని సూచిస్తుంది?
    1)
బెంగాల్‌ నుంచి డచ్‌ వారిని వెల్లగొట్టడం   2)  బెంగాల్‌ లో ఆధునిక యుగ ప్రారంభం    3) ఈస్టిండియా వ్యాపార లక్షణం ముగియడం   4) మీర్‌జాఫర్‌ను తొలగించి మార్‌ఖాసిం బెంగాల్‌ నవాబ్‌ కావడం
17. బెంగాల్‌ ప్రభుత్వ మొదటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
    1)
వారన్‌ హేస్టింగ్స్‌      2) రాబర్ట్‌క్లైవ్‌      3) కారన్‌వాలీస్‌         4) కానింగ్‌
18. బెంగాల్‌ తరువాత ఏ ప్రాంతంలో బ్రిటీషువారు స్వేచ్ఛా వ్యాపార హక్కులను సాఽధించారు?
    1)
బెనారస్‌     2) అవధ్‌    3) హెదరాబాద్‌  4) భరత్‌పూర్‌ జాట్‌ల ప్రాంతాలు
19. బక్సార్‌ యుద్ధంలో మిత్రకూటమి సేనల పరాజయానికి ప్రధాన కారణం?
    1)
సేనాధిపతుల కుట్రలు  2) షా ఆలం -2 నిర్ణయం  3) భారతదేశ సైన్యాలు, ప్రభుత్వ స్వభావంలోని మార్పులు  4) యుద్ధానికి సరైన సన్నద్ధత లేకపోవడం
20. మీర్‌ఖాసిం తన రాజధానిని ముర్షీదాబాద్‌ నుంచి ఎక్కడకు మార్చాడు?
    1)
మోంగిర్‌      2) మిడ్నాపూర్‌    3) బురుద్వాన్‌      4) లక్నౌతీ
21. రైతుల నుంచి జమీందార్లు సేకరించిన కౌలుదారిలో ఎంత శాతాన్ని వారు కంపెనీకి కట్టాలి?
    1) 33
శాతం           2) 50 శాతం      3) 66 శాతం         4) 89 శాతం
22. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల బెంగాల్‌లో ఏ పరిణామం సంభవించలేదు?
    1)
బ్రిటీష్‌వారికి విశ్వాసపాత్రులైన భూస్వాములు ఏర్పడ్డారు   2) వ్యవసాయోత్పత్తి మెరుగుపడింది 3) రైతులు పూర్తిగా జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డారు  4) ప్రభుత్వానికి ఆదాయంలో    పెరుగుదల అవకాశం లోపించింది
23. కేవలం సంవత్సరానికి రూ. 50 లక్షల పింఛనుకు అంగీకరించి మొత్తం బెంగాల్‌ ఆదాయాలను కంపెనీకి ధారాదత్తం చేసింది ఎవరు?
    1)
మీర్‌జాఫర్‌          2) సయిఫుద్దౌల్లా    3) నాజిముద్దౌలా               4) ముబారకుద్దౌలా
24. 1760లో మీర్‌ఖాసిం కంపెనీకి స్వాధీనం చేసిన జిల్లాలు?
    1)
హుగ్లీ, హౌరా, మిడ్నాపూర్‌      2) మురిషిబాద్‌, బాలాసార్‌    3) ఢాకా, చిట్టిగాంగ్‌, హుగ్లీ    4) బురుద్వాన్‌, మిడ్నాపూర్‌, చిట్టిగాంగ్‌
25. మీర్‌ఖాసింపై బ్రిటీష్‌వారు యుద్ధం ప్రకటించడానికి కారణం ఎమిటి?
    1)
కంపెనీ ఉద్యోగుల స్వేచ్ఛా వ్యాపారానికి అభ్యంతరం చెప్పడం  2) కంపెనీ ఉద్యోగులు నిరంకుశ పద్ధతిలో రెవిన్యూ వసూలు చేయడాన్ని ఆపడం  
    3)
వ్యాపారస్తులను  పన్నుల నుంచి మినహాయించడం      4) బ్రిటీష్‌ వారిని బహిష్కరించడం
26. దస్తక్‌లు అంటే?
    1)
ఎగుమతి-దిగుమతిపై పన్నులు చెల్లించకుండా వ్యాపారాన్ని కొనసాగించడానికి కంపెనీ వర్తకులకు అనుమతి ఇచ్చే లైసెన్సులు 2) కంపెనీ దుకాణాలు 3) కంపెనీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
    4)
కంపెనీకి చెందిన నౌకలు
27. రైత్వారీ విధానంలో బ్రిటీష్‌ ప్రభుత్వం ఎవరితో ప్రత్యక్ష ఒప్పందం చేసుకొంది?
    1)
జమిందార్లు 2) గ్రామాలు 3) రైతులు 4) కరణాలు
28. జమిందార్లతో బ్రిటీష్‌ ప్రభుత్వం  పన్ను చెల్లింపుల్లో చేసుకొన్న ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు?
    1)
శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి      2) మహాల్వారీ పద్ధతి       3) రైత్వారీ పద్ధతి    4) స్వేచ్ఛా పద్ధతి
29. 19వ శతాబ్దంలో ‘సీ ఆఫ్‌ కలామిటీ’గా వర్ణించిన క్షామం ఏది?
    1)
రాజస్తాన్‌- 1868-69    2) మద్రాస్‌- 1866-67    3) ఒరిస్సా-1866-67       4) బెంగాల్‌-1860-61
30. కింది ప్రాంతాల్లో ఎక్కడ మొత్తం ఉత్పత్తిలో 1/3 వంతున పన్నుగా వసూలు చేయడానికి కంపెనీ అంగీకరించింది?
    1)
బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా  2) గంగానదీలోయ 3) ముంబాయి ప్రెసిడెన్సీ    4) మద్రాసు ప్రెసిడెన్సీ
31. రైత్వారీ విధానం అమలులో ఉన్న ప్రాంతాల్లో ఎవరు వ్యవసాయదారులకు పెద్ద ముప్పుగా పరిణమించారు?
    1)
రెవెన్యూ కలెక్టర్‌      2) గ్రామ పెద్దలు      3) వడ్డీ వ్యాపారులు     4) టాక్స్‌ ఫార్మర్లు
32. నాగాల నాయకురాలైన గైడెన్య్లూకు రాణి అనే బిరుదు ఇచ్చింది ఎవరు?
    1)
మహాత్మాగాంధీ       2) జవహర్‌లాల్‌ నెహ్రూ      3) వల్లభాయ్‌ పటేల్‌      4) సుభాష్‌ చంద్రబోస్‌
33. బ్రిటీష్‌ హయాంలో రైతులు శాశ్వత రుణగ్రస్తులుగా మారడానికి కారణం?
    1)
తప్పుడు లెక్కలు   2) ఫోర్జరీలు    3) అప్పు తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి సంతకాలు తీసుకోవడం    4) అధిక వడ్డీరేట్లు
34. 19వ శతాబ్దంలో వ్యవసాయదారులు నిరుపేదలుగా మారడానికి కారణం?
    1) 
బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం    2) సాంకేతికాభివృద్ధి లోపించడం    3) పెద్ద మొత్తంలో భూమిపన్ను వసూలు చేయడం  4) గ్రామీణ నిర్మాణంలో మార్పులు రావటం
35. బ్రిటీష్‌ పాలనలో మొదటి కొన్ని శతాబ్దాలలోనే బెంగాల్‌లో పాత జమీందారులు నాశనం కావడానికి కారణం?
    1)
ద్వంద్వ ప్రభుత్వం  2) ద్వంద్వ ప్రభుత్వ రద్దు 3) రెవెన్యూ హక్కులను వేలం వేయడం      4) 1770 నాటి క్షామం
36. ఈ కింది వాటిలో ఏ విధానం అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు, ప్రభుత్వం మధ్య సన్నిహిత సంబంధాల్ని ఏర్పరిచింది?
    1) 
రైత్వారీ విధానం   2) జమీందారీ విధానం    3) మహాల్వారీ విధానం 4) మూతాదారీ విధానం
37. భూస్వామ్య పద్ధతి వ్యాప్తితో ఈ కింది వానిలో ఏది అభివృద్ధి చెందింది?
    1)
అరిస్ర్టోక్రసీ           2) పెట్టుబడిదారి విధానం    3) సబ్‌-ఇన్‌ఫ్యూడేషన్‌   4) వ్యవసాయం
38. బ్రిటీష్‌ పాలనలో భూ కమతాలు విభజించడానికి ప్రధాన కారణం?
    1)
వ్యక్తిగత ఆస్థుల సృష్టి   2) జనాభా పెరగటం  3)  ధరలు పెరగడం 4) భూమి కొరతగా ఉండడం
39. భారతదేశంలో కాటన్‌ దిగుమతులను నిషేదించని, అధిక పన్నులు విధించని ఒకే ఒక ఐరోపా దేశం?
    1)
జర్మనీ 2) హాలాండ్‌ 3) ఫ్రాన్స్‌ 4) ఇటలీ
40. బ్రిటీష్‌వారి ఆర్థిక, వ్యాపార విధానాల వల్ల పూర్తిగా నశించిన భారతీయ వ్యాపారవర్గం ఏది?
    1)
చక్కెర తయారీదార్లు  2) బ్యాంకర్లు    3) బ్రోకర్లు      4) రవాణా సౌకర్యాలు
41. ఈ కింది వారిలో ఏ వ్యాపారం పూర్తిగా ఐరోపా వర్తకుల ఏకస్వామ్యంగా మారినది?
    1)
దిగుమతి వ్యాపారం   2) వస్త్ర వ్యాపారం      3) వ్యవసాయ ఎగుమతుల వ్యాపారం    4) ఉప్పు తయారీ అమ్మటం
42. గ్రామీణ చేతివృత్తుల పరిశ్రమ క్షీణతకు ఈ కింది అంశాలలో ఏది ప్రధాన కారణం?
    1)
ధరల పెరుగుదల  2) జనాభా పెరుగుదల      3) రైల్వేల నిర్మాణం  4) వ్యవసాయరంగంపై ఒత్తిడి
43. బెంగాల్‌ రైతుల మొదటి వ్యతిరేకత ఎప్పుడు ప్రారంభమైంది?
    1)
పన్నుల నిరాకరణ ఉద్యమం  2) 1859-60 నీలిమందు తిరుగుబాటు 3) వడ్డీ వ్యాపారులపై దాడులు  4) ఇండిగో పంటల దహనం
44. బ్రిటీష్‌ కాలంలో వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన మూలధనం లేకపోవడానికి కారణం ఏమిటి?
    1)
పరిపతి సౌకర్యాలు లేకపోవడం      2) భయంకర పేదరికం  3) అధిక పన్నుల రేటు  4) సాంకేతికత లోపించడం
45. బెంగాల్‌లో నూతనంగా ఆవిర్భవించిన మధ్యతరగతి ప్రజలలో ప్రధానవర్గం ఎవరు?
    1)
వ్యాపారులు     2) బ్యాంకర్లు    3) జమిందారులు     4) వృత్తిపని వారు
46. భారతదేశంతో వ్యాపారంలో ఈస్టిండియా కంపెనీకి గల ఏకస్వామ్యం రద్దయిన సంవత్సరం ఏది?
    1) 1813  2) 1833 3) 1853 4) 1793
47. ఈస్టిండియా వ్యాపార విధులు ఎప్పుడు తొలగించబడ్డాయి?
    1) 1833
చార్టరు చట్టం  2) 1878 పిట్సు చట్టం      3) 1861 ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం 4) 1858 చట్టం
48. భారతదేశ అంతర్గత వ్యాపారంపై బ్రిటీష్‌ ఏకస్వామ్యం ఎక్కువ కావడం వల్ల లబ్ధి పొందిన వారు?
    1)
కంపెనీ          2) కంపెనీ ఉద్యోగులు    3) బ్రిటీష్‌ ప్రభుత్వం      4) రైతులు
49. బ్రిటీష్‌ ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన గ్రామీణ పెట్టుబడిదారీ వర్గంలో ముఖ్యులు ఎవరు?
    1)
జమీందారులు       2) పెద్ద భూస్వాములు    3) వడ్డీ వ్యాపారులు     4) పైఅందరూ
50. భారతదేశంలో బ్రిటీష్‌ పెట్టుబడి ఎక్కువగా ఏ రంగంలో జరిగింది?
    2)
రైల్వేలు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, షిప్పింగ్‌   
సమాధానాలు...
1) 1 2) 1 3)2  4)2 5) 1 6) 1 7) 2 8) 3 9) 1 10) 1 11) 3 12) 1 13) 3 14) 3 15) 4 16) 4 17) 1 18) 2 19) 3 20) 1 21) 4 22) 2 23) 3 24) 4 25) 3 26) 1 27) 3 28) 1 29) 4 30) 4 31) 3 32) 2 33) 4 34) 3 35) 3 36) 1 37) 3 38) 4 39) 2 40) 3 41) 1 42) 3 43) 2 44) 3 45) 3 46) 1 47) 1 48) 2  49) 4 50) 2










No comments:

Post a Comment